Telugu Global
Others

ఆర్య సమాజ్‌లో ప్రేమజంటపై దాడి

హైదరాబాద్‌లో ప్రేమ జంటపై దాడి జరిగింది. సైదాబాద్‌ ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకునేందుకు వచ్చిన ప్రేమ జంటపై యువతి బంధులు దాడి చేశారు. ఆమెను బలవంతంగా తీసుకువెళ్లి పోయారు. ముందుగా ఆమెను ఆర్య సమాజ్ నుంచి బయటకు లాగి ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆమె మొరాయించడంతో ఆటోలో కుక్కెశారు. కొంతదూరం వెళ్ళిన తర్వాత ఆమె బాగా ప్రతిఘటించడంతో కిందికి దింపి మళ్ళీ మోటారు సైకిల్ పై ఎక్కించే ప్రయత్నంలో రోడ్డుపై తీవ్ర పెనుగులాట జరిగింది. మొత్తం […]

హైదరాబాద్‌లో ప్రేమ జంటపై దాడి జరిగింది. సైదాబాద్‌ ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకునేందుకు వచ్చిన ప్రేమ జంటపై యువతి బంధులు దాడి చేశారు. ఆమెను బలవంతంగా తీసుకువెళ్లి పోయారు. ముందుగా ఆమెను ఆర్య సమాజ్ నుంచి బయటకు లాగి ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆమె మొరాయించడంతో ఆటోలో కుక్కెశారు. కొంతదూరం వెళ్ళిన తర్వాత ఆమె బాగా ప్రతిఘటించడంతో కిందికి దింపి మళ్ళీ మోటారు సైకిల్ పై ఎక్కించే ప్రయత్నంలో రోడ్డుపై తీవ్ర పెనుగులాట జరిగింది. మొత్తం మీద బైక్ పై మధ్యలో ఎక్కించి ఆమెకు ముందూవెనుక కూర్చుని బలవంతంగా లాక్కుపోయారు. లితత్‌బాగ్‌కు చెందిన దుర్గేష్‌, ఉప్పుగూడకు చెందిన మౌనిక ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించి సోమవారం సైదాబాద్‌ ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకునేందుకు స్నేహితులతో కలిసి ప్రేమజంట వెళ్లింది. విషయం తెలుసుకున్న యువతి బంధువులు ఆర్య సమాజ్‌ వద్దకు చేరుకుని ప్రియుడుపై దాడి చేసి యువతిని బలవంతంగా ఇంటికి తీసుకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై ప్రియుడు దుర్గేష్‌ మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తామిద్దరం మేజర్లమని, ప్రేమించుకున్నామని, తమ పెళ్ళికి సహకరించాలని అభ్యర్థించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
First Published:  28 Jun 2015 1:22 PM GMT
Next Story