Telugu Global
National

వ‌సుంధ‌రకు మోడీ, షాల 'నో' అపాయింట్‌మెంట్‌

రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు బ ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా  అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె పార్టీ అధిష్టానాన్ని, ప్రధానిని కలిసేందుకు ప్రయత్నించారు. వీరిద్ద‌రూ కూడా నిరాక‌రించారు. ఈ క్రమంలోనే ఆమెకు అపాయింట్‌మెంట్ దొర‌క లేదు. దీంతో వసుంధర నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే తిరిగి రాజస్థాన్ వెళ్ళిపోయారు. వివాదాస్పద ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ […]

వ‌సుంధ‌రకు మోడీ, షాల నో అపాయింట్‌మెంట్‌
X
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు బ ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె పార్టీ అధిష్టానాన్ని, ప్రధానిని కలిసేందుకు ప్రయత్నించారు. వీరిద్ద‌రూ కూడా నిరాక‌రించారు. ఈ క్రమంలోనే ఆమెకు అపాయింట్‌మెంట్ దొర‌క లేదు. దీంతో వసుంధర నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే తిరిగి రాజస్థాన్ వెళ్ళిపోయారు. వివాదాస్పద ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ అవినీతి వ్యవహారంలో వసుంధర రాజేపై వస్తున్న ఆరోపణల నేప‌థ్యంలో ఆమెకు అపాయింట్‌మెంట్ నిరాక‌రించ‌డం గ‌మ‌నార్హం.
First Published:  27 Jun 2015 6:05 AM GMT
Next Story