Telugu Global
Others

తాగిన మైకంలో స్నేహితుడి హ‌త్య‌!

తాగిన మైకంలో త‌మ స్నేహితుడ్నే చంపేశారు ఓ ఇద్ద‌రు దుర్మార్గులు. ఈ సంఘ‌ట‌న కర్నూలు జిల్లాలో సంచలంనం సృష్టించింది. కర్నూలుజిల్లా ఎమ్మిగనూరు మండలం సీరాలదొడ్డికి చెందిన హనుమంతు, భీమన్న, రామలింగడు అనే ముగ్గురు స్నేహితులు కలిసి మందు తాగారు, ఆ మత్తులో హనుమంతుకు మిగతా ఇద్దరు స్నేహితులతో వివాదం  మొదలైంది. అది చిలికిచిలికి గాలివానగా మారింది.  దీంతో భీమన్న, రామలింగడు కలిసి..హనుమంతుని హత్య చేశారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు హంతకుల్ని చెట్టుకి కట్టేసి.. పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసులు […]

తాగిన మైకంలో త‌మ స్నేహితుడ్నే చంపేశారు ఓ ఇద్ద‌రు దుర్మార్గులు. ఈ సంఘ‌ట‌న కర్నూలు జిల్లాలో సంచలంనం సృష్టించింది. కర్నూలుజిల్లా ఎమ్మిగనూరు మండలం సీరాలదొడ్డికి చెందిన హనుమంతు, భీమన్న, రామలింగడు అనే ముగ్గురు స్నేహితులు కలిసి మందు తాగారు, ఆ మత్తులో హనుమంతుకు మిగతా ఇద్దరు స్నేహితులతో వివాదం మొదలైంది. అది చిలికిచిలికి గాలివానగా మారింది. దీంతో భీమన్న, రామలింగడు కలిసి..హనుమంతుని హత్య చేశారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు హంతకుల్ని చెట్టుకి కట్టేసి.. పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయినప్పటికీ.. స్థానికులకు ఆగ్ర‌హం చ‌ల్లార‌లేదు. పోలీసుల సాక్షిగా హంతకులపై దాడికి తెగబడ్డారు . తాగిన మైకంలో హనుమంతును స్నేహితులే కొట్టి చంపారంటూ గ్రామస్థులంతా భీమన్న, రామలింగడులను పట్టుకుని చితగ్గొట్టారు. దాడితో అలర్టయిన పోలీసులు ప్రజల్ని వారించి నిందితులను పోలీస్టేషన్‌కు తరలించారు.
First Published:  24 Jun 2015 1:04 PM GMT
Next Story