Telugu Global
Others

చివరి రక్తపు బొట్టు వరకు జగన్‌తోనే: న‌ల్ల‌పురెడ్డి

తన చివరి రక్తపు బొట్టు వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని నెల్లూరు జిల్లా ఆ పార్టీ అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు. తాను పార్టీకి రాజీనామా చేసినట్టు వచ్చిన వార్తలో నిజం లేదని ఆయన అన్నారు. 2012లో ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకే కట్టుబడి ఉంటానని, తనకు ఏమైనా సమస్యలుంటే పార్టీ అధ్యక్షుడు జగన్‌తో మాట్లాడుకుంటానని ఆయన అన్నారు. తాను రాజీనామా చేసి ఆ లేఖను జగన్‌కు ఫ్యాక్స్‌లో పంపానని ఎబిఎన్ రిపోర్టర్‌కు […]

తన చివరి రక్తపు బొట్టు వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని నెల్లూరు జిల్లా ఆ పార్టీ అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు. తాను పార్టీకి రాజీనామా చేసినట్టు వచ్చిన వార్తలో నిజం లేదని ఆయన అన్నారు. 2012లో ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకే కట్టుబడి ఉంటానని, తనకు ఏమైనా సమస్యలుంటే పార్టీ అధ్యక్షుడు జగన్‌తో మాట్లాడుకుంటానని ఆయన అన్నారు. తాను రాజీనామా చేసి ఆ లేఖను జగన్‌కు ఫ్యాక్స్‌లో పంపానని ఎబిఎన్ రిపోర్టర్‌కు ఎవరు చెప్పారో, ఎలా తెలిసిందో తనకు తెలియదని, జగన్మోహనరెడ్డిగారు తనను తిట్టినట్టు వారు విన్నారేమో నాకైతే తెలీదు. నన్ను ఆయన ఎప్పుడూ మర్యాదగానే చూస్తారు. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు అని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు సంతలో సరుకులు కొన్నట్టు ఎంపీటీసీలను కొనాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.
First Published:  23 Jun 2015 1:18 PM GMT
Next Story