Telugu Global
Others

పార్లమెంటులో 85 శాతం మంది కోటీశ్వరులు!

పార్లమెంటులో వున్న 85 శాతం మంది కోటీశ్వరులేనని… వారంతా బడా పారిశ్రామిక వేత్తలేనని… ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త తీస్తా సెటల్వాద్‌ వ్యాఖ్యానించారు. వారు కోట్లు కురిపించే మైనింగ్‌ బిల్లులపై చూపే శ్రద్ద… ఆహార భద్రత బిల్లుపై చూపరని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. హక్కుల కోసం పోరాడితే ఆదివాసీలను జాతి విద్రోహులంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేపాల్‌లో భూకంపం కవరేజ్‌కు వెళ్లిన ఇండియన్‌ మీడియాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలే బాధల్లో […]

పార్లమెంటులో 85 శాతం మంది కోటీశ్వరులు!
X
పార్లమెంటులో వున్న 85 శాతం మంది కోటీశ్వరులేనని… వారంతా బడా పారిశ్రామిక వేత్తలేనని… ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త తీస్తా సెటల్వాద్‌ వ్యాఖ్యానించారు. వారు కోట్లు కురిపించే మైనింగ్‌ బిల్లులపై చూపే శ్రద్ద… ఆహార భద్రత బిల్లుపై చూపరని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. హక్కుల కోసం పోరాడితే ఆదివాసీలను జాతి విద్రోహులంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేపాల్‌లో భూకంపం కవరేజ్‌కు వెళ్లిన ఇండియన్‌ మీడియాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలే బాధల్లో వున్నవారి పట్ల మీడియా ప్రతినిధులు వ్యవహరించిన తీరు బాధ కలిగించిందన్నారు.
First Published:  21 May 2015 1:08 PM GMT
Next Story