Telugu Global
Others

రెండు తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు ఐపీఎస్‌లు

హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను కేటాయించింది. 2013లో సివిల్‌ సర్వీస్‌కు ఎంపికైన అధికారుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారిని కేంద్ర హోంశాఖ అధికారులు రాష్ట్రాలకు కేటాయించారు. వారిలో దీపిక(కర్ణాటక), డి.కె.రాహుల్‌ హెగ్డే(కర్ణాటక), సునీల్‌దత్‌(ఉత్తరాఖండ్‌), అమిత్‌బర్బార్‌(రాజస్థాన్‌), బి.కృష్ణారావు(ఆంధ్రప్రదేశ్‌), కె.అపూర్వరావు(ఆంధ్రప్రదేశ్‌)లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ కింద కేటాయించారు. అయితే వారిలో ఎవరెవరు ఏ రాష్ట్రానికి వెళ్లాలన్నది యువ ఐపీఎస్‌ల విన్నపం మేరకు నిర్ణయించాలని ఆయా ప్రభుత్వాలకు సూచించింది.

హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను కేటాయించింది. 2013లో సివిల్‌ సర్వీస్‌కు ఎంపికైన అధికారుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారిని కేంద్ర హోంశాఖ అధికారులు రాష్ట్రాలకు కేటాయించారు. వారిలో దీపిక(కర్ణాటక), డి.కె.రాహుల్‌ హెగ్డే(కర్ణాటక), సునీల్‌దత్‌(ఉత్తరాఖండ్‌), అమిత్‌బర్బార్‌(రాజస్థాన్‌), బి.కృష్ణారావు(ఆంధ్రప్రదేశ్‌), కె.అపూర్వరావు(ఆంధ్రప్రదేశ్‌)లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ కింద కేటాయించారు. అయితే వారిలో ఎవరెవరు ఏ రాష్ట్రానికి వెళ్లాలన్నది యువ ఐపీఎస్‌ల విన్నపం మేరకు నిర్ణయించాలని ఆయా ప్రభుత్వాలకు సూచించింది.
First Published:  27 April 2015 2:22 AM GMT
Next Story